వరుడ్ని కిడ్నప్ చేసిన వైనం..
పెళ్లి వారిని భయభ్రాంతులకు గురిచేసిన మూకలు..
వివాహ వేడుకలో డ్యాన్స్ చేసే బృందం పెళ్లి కుటుంబాలపై దాడి చేశారు. అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. చివరకు పెళ్లి మండపం నుంచి వరుడ్ని కిడ్నాప్ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను పట్టుకుని వరుడ్ని విడిపించారు. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున సాధు చౌక్లోని పెళ్లి మండపంలో ఒక జంటకు వివాహం జరుగుతున్నది. పెళ్లి వేడుకలో సాంప్రదాయ నృత్యం చేసే ‘లౌండా నాచ్ పార్టీ’కి చెందిన కళాకారులు డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది.
కాగా, అంతా పెళ్లి హడావుడిలో ఉండగా డ్యాన్సర్లు తమపై దాడి చేసి కొట్టారని వధూవరుల కుటుంబాలు వాపోయాయి. పెళ్లికుమారుడితోపాటు పెళ్లికుమార్తెను, మహిళలను కూడా కొట్టారని, నగలతో పాటు విలువైన వస్తువులను దోచుకున్నారని ఆరోపించారు. వరుడ్ని కిడ్నాప్ చేసి వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. డ్యాన్సర్లు కిడ్నాప్ చేసిన వరుడి కోసం విస్తృతంగా వెతికారు. ఏడు గంటల తర్వాత జామో ప్రాంతంలో వారు ఉన్నట్లు గుర్తించారు. డ్యాన్స్ బృందం చెర నుంచి వరుడ్ని విడిపించారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే డబ్బు విషయంపై పెళ్లి కుటుంబాలు, డ్యాన్సర్ల మధ్య ఘర్షణ వల్ల ఈ సంఘటన జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.