బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. కేఎల్ రాహుల్ (26: 74 బంతుల్లో 3 ఫోర్లు) మినహా మిగతా బ్యాటర్లు తేలిపోయారు. యశస్వి జైస్వాల్ (0), దేవదత్ పడిక్కల్ (0) డకౌట్ కాగా.. విరాట్ కోహ్లీ (5) ,ధృవ్ జోరెల్ (11) స్వల్ప పరుగులకే వెనుదిరిగారు .ప్రస్తుతం భారత్ 5 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజ్లో రిషభ్ పంత్ (17*) వాషిగ్టన్ సుందర్ (4) ఉన్నారు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ 2, జోష్ హేజిల్వుడ్ 2 వికెట్లు మార్ష్ 1 వికెట్ పడగొట్టారు.
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. అనంతరం దేవదత్ పడిక్కల్ వచ్చాడు. గిల్ స్థానంలో వచ్చిన పడిక్కల్ క్రీజ్లో కుదరుకునేందుకు ప్రయత్నించాడు. ఆసీస్ పదునైన బౌలింగ్ ముందు పడిక్కల్ నిలవలేకపోయాడు. 23 బంతులు ఎదుర్కొన్నప్పటికీ పరుగుల ఖాతా మాత్రం తెరవలేదు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కాస్త ఆత్మవిశ్వాసంతో ఆడినట్లు కనిపించాడు. కానీ, బౌన్సర్ను అర్థం చేసుకోలేకపోయిన అతడు కోహ్లీ వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా కేఎల్ మాత్రం పరుగులు రాబట్టాడు. కానీ, వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్కు చేరాల్సి వచ్చింది.ధృవ్ జోరెల్ బాగానే ఆడినట్లు కనిపించిన 11 పరుగుల వద్ద మార్ష్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.