. గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా బండి సంజయ్..
. హైడ్రా అనేది ప్రజలకు భూతం లెక్క…
. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోంది…
రేవంత్ రెడ్డిపై కీలక వాక్యాలు చేసిన బండి సంజయ్. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… హైడ్రా అనేది ప్రజలకు భూతం లెక్క కనిపిస్తుంది అని అయన అన్నారు. హైడ్రా ఎవరి ఉద్దరించాడనికి అని రేవంత్ రెడ్డి పై బండి సంజయ్ ధ్వజమెత్తాడు.

రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత రావాలని కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులే చూస్తున్నారని ఆయనఅన్నారు. జాగ్రత్తపడకపోతే చిక్కులు తప్పవని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనను గద్దె నుంచి దింపేయాలని గోతికాడ నక్కల్లా మంత్రులు చూస్తున్నారని వ్యాఖ్యానించారు..

హైడ్రా, మూసీ, గ్రూప్-1 అనేవి ప్రజలను మభ్య పెట్టడానికే అని. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి ఇదొక కొత్త నాటకం అని అయన అన్నారు . అందుకే రేవంత్ రెడ్డి జాగ్రత్తపడాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని అలర్ట్ చేశారు.ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా, రాక్షసంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం చిల్లర రాజకీయం చేస్తోందని, పేదల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.