Tuesday, June 24, 2025
Google search engine
Homeతెలంగాణరాక్ టౌన్ కాలనీలో నీళ్ల సరఫరాలో అంతరాయం..

రాక్ టౌన్ కాలనీలో నీళ్ల సరఫరాలో అంతరాయం..

కొత్త జంక్షన్ వేయాలని కాలనీ వాసుల వినతి..
సానుకూలంగా స్పందించిన వనస్థలిపురం జీఎం శ్రీనివాస్ రెడ్డి..
ఇటీవలే రూ. 1.8 లక్షలు శాంక్షన్ చేసి జంక్షన్ కూడా చేయడం జరుగుతోంది..

రాక్ టౌన్ కాలనీలో ఉన్న డ్రింకింగ్ వాటర్ సరఫరాలో లో ప్రెషర్ సమస్య, నీళ్లు తక్కువగా రావడం.. కొన్నిసార్లు నీళ్లు సక్రమంగా రాకపోవడం.. అలాగే కొన్ని వాటర్ లైన్స్ లో జెంక్షన్ వాల్స్ స్ట్రక్ అవ్వడం లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.. దీనికి కారణాంక్ ఒక లైన్ లో పైప్ లైన్ మొత్తం లేకపోవడం.. ఈ సమస్య చాలా సంవత్సరాల నుండి ఎదురవుతోంది.. అంతేకాకుండా సరఫరాలో సమస్య ఉండడంతో కొత్త జెంక్షన్ వేయాలని కాలనీ వాసులు వనస్థలిపురం ఏరియా జీఎంని కోరడం జరిగింది. దానికి శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్యనే 1.8 లక్షలు శాంక్షన్ చేసి జెంక్షన్ పనులు చేయిస్తున్నారు.. నీటి సరఫరా సమస్యలు ఉండడం వలన కాలనీ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డిని సంప్రదించి, ఒక సారి కాలనీలో విజిట్ చేసి, రాక్ టౌన్ లో మంచి నీటి సమస్యలను అతని దృష్టికి తీసుకెళ్లి.. ఇక ముందు ఇలాంటి సమస్యలు రాకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వమని కోరడంతో సోమవారం రోజు ఉదయం కాలనీలో పర్యటించి అన్ని సమస్యలు తెలుసుకొని.. సంబంధిత సిబ్బందికి ఇక మీదట వాటర్ సప్లై లో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి, సెక్రటరీ జైపాల్ రెడ్డి, కాలనీ సభ్యులు సుదర్శన్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సప్లై బాయ్స్ శివ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments