హామీ ఇచ్చిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
అధికారులు, కాలనీ వాసులతో కలిసి పర్యటన..
హయత్ నగర్ డివిజన్ లోని మీదాని కాలనీలో జరుగుతున్న నూతన సీసీ రోడ్ పనులను నేడు స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు కాలనీలో మిగిలి ఉన్న వీధుల్లో కూడా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని కార్పొరేటర్ కి విజ్ఞప్తి చేయడంతో ఆయన సమాధానం ఇస్తూ రానున్న రోజుల్లో హయత్ నగర్ డివిజన్ మరింత అభివృద్ధి చేపట్టేలా చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఏఈ హేము నాయక్, మీదాని కాలనీ అధ్యక్షులు శేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంజయ్య, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు..