బాలాపూర్:
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఎస్పీఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన మమత, సాయి దుర్గ ప్రసాద్ల వివాహ వేడుకకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ఇరు కుటుంబాల బంధుమిత్రులు పాల్గొన్నారు.


