ప్రతి అమావాస్య నాడు క్రమం తప్పకుండా నిర్వహణ..
హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సీహెచ్. పారిజాత నర్సింహా రెడ్డి..
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి అమావాస్య రోజున అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తుంటారు.. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి..
ఈ కార్యక్రమంలో నాయకులు పోరెడ్డి భాస్కర్ రెడ్డి, గజ్జెల రాంచందర్, టేకుల సుధాకర్ రెడ్డి, ఇక్కే శ్రీనివాస్, తూళ్ళ నరహరి గౌడ్, పోరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుల దయాకర్ రెడ్డి, వంగేటి రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


