Friday, June 20, 2025
Google search engine
Homeడివోషనల్శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..

బంగారు రథంపై ఆది దంపతుల ఊరేగింపు..

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీశైలంలో శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు వైభవంగా స్వర్ణరథోత్సవం నిర్వహించారు. దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం జరిపించారు. స్వర్ణరథంపై ఆసీనులై ఉన్న శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్పూర హారతులు సమర్పించారు.

అనంతరం స్వర్ణరథోత్సవం ఆలయ రాజగోపురం నుండి ఆలయం మాడవీధులలోని హరిహరరాయ గోపురం,బ్రహ్మానందరాయ గోపురం,శివాజీ గోపురం మీదుగా మాడవీధులలో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు మేళతాళాలతో వైభవంగా స్వర్ణరథోత్సవం జరిగింది బంగారు స్వర్ణరథోత్సవం ఆలయ మాడవీధులలో ఊరేగించారు. ఈ వేడుకను తిలకించేందుకువందలాదిగా భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వర్ణ రథోత్సవాన్ని కన్నులారా తిలకించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments