కొనియాడిన లింగోజిగూడా కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి..
60 వేలరూపాయల ఫండ్ అమౌంట్ ని బాధితుడు జావిడి మదన్ కు అందజేత..
ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చని సూచన..
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. లింగోజిగూడ డివిజన్ కు చెందిన జావిడి మదన్ గత కొన్ని రోజులుగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డిని కోరగా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేశారు.. కాగా ప్రభుత్వం నుంచి 60 వేల రూపాయలు మంజూరైనట్లు ఆయన తెలిపారు సందర్భంగా గురువారం బాధితునికి మంజూరైన చెక్కును అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు అన్నారు. మరికొందరు సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పల్సం శ్రీధర్ గౌడ్, కందికంటి శ్రీధర్ గౌడ్, యశ్వంత్ కుమార్, కరణ్ కుమార్, శ్రీకాంత్, లక్ష్మారెడ్డి ,గౌస్ తదితరులు పాల్గొన్నారు.