30 లక్షల జరిమానా..
లక్నో జట్టుకు ఫైన్ విధింపు..
లక్నో సూపర్ గెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు .. 30 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసింది. ఈ నేపథ్యంలో లక్నో జట్టుకు ఫైన్ వేశారు. అయితే లక్నో ప్లేయర్లకు కూడా 12 లక్షల జరిమానా విధించారు. దీంట్లో ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉన్నాడు. ఈ సీజన్లో ప్రవర్తనా నియమావళిని మూడోసారి లక్నో జట్టు ఉల్లంఘించినట్లు ఐపీఎల్ తన ప్రకటనలో తెలిపింది. అందుకోసమే పంత్కు 30 లక్షలు ఫైన్ వేసినట్లు చెప్పింది. లక్నో జట్టులోని మిగితా ఆటగాళ్లకు 12 లక్షలు లేదా 50 శాతం ఫీజులో కోత విధించనున్నారు.
హై స్కోరింగ్ గేమ్లో ఆర్సీబీ జట్టు ఆరు వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది. రిషబ్ పంత్ సెంచరీ చేసినా తమ జట్టుకు విక్టరీని అందించలేకపోయాడు. ఈ మ్యాచ్లో అతను 61 బంతుల్లో 118 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఆర్సీబీ ఈ గెలుపుతో క్వాలిఫయర్ 1కు వెళ్లింది. గురువారం చండీఘడ్లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్తో ఆడనున్నది.