వెల్లడించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ..
హయత్ నగర్ డివిజన్ లోని బ్లడ్ బ్యాంక్ కాలనీలో శుక్రవారం రోజు స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కాలనీవాసులతో కలసి నూతన మంచి నీటి పైప్ లైన్ పనులను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలకు అనుగుణంగా డివిజన్ లోని ప్రతి కాలనీలో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని.. రానున్న రోజుల్లో కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ లోని కాలనీలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బానోత్ భాగ్య నాయక్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మురళీధర్ రెడ్డి, నర్సింహ గౌడ్, మల్లేష్ గౌడ్, కళ్యాణ్ యాదవ్, యశ్వంత్, రాజేందర్ రెడ్డి, కిషన్ నర్సింహా యాదవ్, బీజేపీ నాయకులు ఎర్రవెలి సత్యనారాయణ, శ్రీకాంత్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.