ఓటర్ల క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ
ఎల్బీనగర్:
ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబంధించి క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ మరియు విచారణ ప్రక్రియలో భాగంగా సరూర్నగర్లో నేడు ఉదయం 9.00 గంటల నుంచి ఐదు ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించబడనున్నాయి.
గ్రామ సభలు నిర్వహించబడే ప్రదేశాలు:
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరూర్నగర్
- సీనియర్ సిటిజన్ న్యూ బిల్డింగ్, హుడా కాంప్లెక్స్
- క్రాంతినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం
- సీనియర్ సిటిజన్ భవన్, డాక్టర్స్ కాలనీ
- బస్తీ దవాఖానా, భగత్సింగ్ నగర్
ఓటర్ల జాబితా పరిశీలనలో మ్యాపింగ్ కాని ఓటర్లందరూ సంబంధిత గ్రామ సభకు హాజరై తమకు సంబంధించిన నోటీసులను స్వీకరించవచ్చు. మ్యాపింగ్ కాని ఓటర్లు సమర్పించాల్సిన అవసరమైన పత్రాలు, ఆధారాల వివరాలను సంబంధిత బీఎల్ఓలు వారికి వివరిస్తారు. అవసరమైన పత్రాలను సమర్పించి తమ క్లెయిమ్ను నమోదు చేసుకోవచ్చు.
అదేవిధంగా, మ్యాపింగ్ అయినప్పటికీ ఏవైనా లోపాలు లేదా అసమానతలు గుర్తించబడిన ఓటర్లు కూడా గ్రామ సభకు హాజరై సంబంధిత నోటీసులను స్వీకరించి, అవసరమైన వివరణలు మరియు పత్రాలను సమర్పించవచ్చు.
కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే అర్హత కలిగిన పౌరులు ఫారం-6 సమర్పించవచ్చు. ఓటరు పేరు తొలగింపుకు ఫారం-7, ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు లేదా నివాసం మార్పు కోసం ఫారం-8 సమర్పించవచ్చు.
ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అన్ని క్లెయిమ్స్ మరియు అభ్యంతరాలను గ్రామ సభల్లో విచారించనున్నారు. సంబంధిత ఎలక్టోరల్ రోల్ సూపర్వైజర్లు మరియు బూత్ లెవల్ అధికారులు ఆయా గ్రామ సభల వద్ద ఉదయం 9 గంటల నుంచి అందుబాటులో ఉండి, ఓటర్ల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు మరియు సంబంధిత దరఖాస్తులను స్వీకరించి అవసరమైన సహాయాన్ని అందిస్తారు.
అందువల్ల సంబంధిత ఓటర్లు తమకు సంబంధించిన గ్రామ సభ ప్రదేశానికి ఉదయం 9.00 గంటలకు లేదా అనంతరం హాజరై, తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని, అవసరమైన క్లెయిమ్స్, అభ్యంతరాలు లేదా దరఖాస్తులను సమర్పించుకోవాలని మండల తహసీల్దార్ పి వేణు గోపాల్ కోరడమైనది.


