మన్సూరాబాద్, నుంచి దేవతల గుత్తా వరకు బైక్ ర్యాలీ..
భక్తాదులు విశేషంగా పాల్గొనాలని పిలుపునిచ్చిన శివాలయం గోశాల సభ్యులు..
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం.. సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం..
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం.. రామం నిశాచర వినాశకరం నమామి..
శ్రీరామ నవమి సందర్భంగా ఈనెల 6వతేదీ, ఆదివారం రోజు ఉదయం 9 గంటలకు శ్రీ రామ నవమి శోభా యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ జరుగనుంది.. మన్సూరాబాద్, ఎల్.బీ. నగర్ లోని శివాలయం గోశాల నుండి బాలాపూర్ లోని దేవతలగుట్ట శ్రీ స్వయంబు హనుమాన్ దేవస్థానం వరకు జరిగే బైక్ ర్యాలీ కార్యక్రమంలో ప్రతి హిందూ బంధువులు అందరు పాల్గొని శ్రీ రాముని ఆశీర్వాదం తీసుకొని, విజయవంతం చేయాలని శివాలయం గోశాల సభ్యులు గోరకంటి వినోద్ కుమార్, గోవిడ్ రెడ్డి, వెంకటేశం, గోపీనాథ్ తదితరులు కోరుతున్నారు..