రాక్ టౌన్ కాలనీ జిమ్ పార్క్ లో మొక్కలు నాటిన స్థానికులు..
కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు, కాలనీ వాసులు..
గురువారం రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా రాక్ టౌన్ కాలనీలో పర్యావరణ ప్రేమికుడు టీచర్ లింగారెడ్డి సహకారంతో రాక్ టౌన్ ఓపెన్ జిమ్ పార్క్ లో కొన్ని చెట్లు నాటడం జరిగింది.. ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, పరిసర కాలనీల మిత్రులు పాల్గొన్నారు. ఈ యొక్క పర్యావరణ కార్యక్రమం రాక్ టౌన్ లో నిర్వహించి, ప్రతి ఒక్కరు కూడా చెట్లని నాటాలని.. అవి భవిష్యత్ లో కాలనీ వాసులకు ఎంతో ఉపయోగ పడతాయని, హైదరాబాద్ లో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం నుండి మనల్ని మనం రక్షించు కొనుటకు ఈ చెట్లు ఎంతగానో ఉపయోగపతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమానికి సహకరించిన లింగారెడ్డికి రాక్ టౌన్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతఙ్ఞతలు తెలియజేయడం జరిగిందని అని రాక్ టౌన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి తెలియజేసారు.