బంగ్లాదేశ్ లో దేశద్రోహం ఆరోపణలతో జైలుకు పంపిన హిందూ పూజారి చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి తరఫున వాదించేందుకు ముందుకు రావడానికి లాయర్లు భయపడుతున్నారు. అయితే ఇప్పటికే ఆయన తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లాయర్ పై ఆయన నివాసంలోనే దాడి జరగడం గమనార్హం. గుర్తుతెలియని దుండగుల దాడిలో ఆయన తీవ్రంగా గాయపడడం జరిగింది.ఈ దాడి వలన మిగతా లాయర్లు ఎవరూ ఆయన తరఫున వాదించేందుకు ముందుకు రావడం లేదు. వాస్తవానికి చిన్మయ్ బెయిల్ పిటిషన్ పై మంగళవారం కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. వాదించేందుకు లాయర్ లేకపోవడంతో చిన్మయ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.
చిన్మయ్ కృష్ణదాస్ పై ప్రభుత్వం కక్షగట్టిందని, ఆయన తరఫున వాదించకుండా దాదాపు 70 మంది లాయర్లపై తప్పుడు కేసులు పెట్టిందని బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ జోట్ ఆరోపించింది. ఈమేరకు బంగ్లాదేశ్ కు చెందిన ది బిజినెస్ స్టాండర్డ్ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. ఛట్టోగ్రామ్ పోలీస్ స్టేషన్ లో హిందూ లాయర్లపై ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిందని, దీంతో వారు కోర్టులో వాదించే అర్హత కోల్పోయారని పేర్కొంది. అయితే ఒక రాజకీయ గ్రూపుకు సంబంధించిన వ్యక్తులు హిందూ లాయర్లను వేధింపులకు గురిచేస్తున్నారని, చిన్మయ్ తరఫున వాదించకుండా బెదిరిస్తున్నారని ఆరోపించింది.
బంగ్లాదేశ్ చిన్మోయ్ కృష్ణ దాస్ లాయర్ పై దాడి… కృష్ణ దాస్ తరుపున వాదించడానికి భయపడుతున్న లాయర్లు
RELATED ARTICLES