పిలుపునిచ్చిన హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కార్యక్రమం..
కుల గణన సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ కోరారు.. కాగా హస్తినాపురం డివిజన్, తుల్జా భవాని నగర్ లో కుల గణనపై జరిగిన సర్వేలో జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పటేల్, డిప్యూటీ కమిషనర్ సేవ ఇస్లావత్, కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కుల గణన సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొని తాము ఇచ్చిన వివరాలను, సర్వే కొచ్చిన అధికారులు నమోదు చేసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల కులగణన సర్వేన విజయవంతం చేయాలని,ఇంటి యజమాని, కిరాయిదారుడు అందరూ తమ తమ వివరాలను ఇవ్వాలని కోరారు.