- చెరువుల పునరుద్ధరణ, విపత్తు నిర్వహణపై అధ్యయనం..
- రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనున్న హైడ్రా అధికారులు..
- పలు చెరువులను కూడా పరిశీలించనున్న రంగనాథ్, ఇతర అధికారులు..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరులోని చెరువుల పునరుద్ధరణ, విపత్తు నిర్వహణపై హైడ్రా అధికారులు అధ్యయనం చేస్తున్నారు.. ఇందుకోసం హైడ్రా అధికారులు కర్ణాటక రాజధానికి చేరుకున్నారు. గురువారం రోజు రంగనాథ్ బెంగళూరుకు చేరుకున్నారు. చెరువుల పరిరక్షణ, విపత్తు నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.. .
హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులు యలహంకలోని కర్ణాటక స్టేట్ నేచరల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ను సందర్శించారు.. అక్కడ సీనియర్ శాస్త్రవేత్తలతో విపత్తు నిర్వహణపై సమావేశమైయ్యారు.. ఆ తర్వాత సెన్సార్ సహాయంతో పర్యవేక్షిస్తున్న మురుగునీటి వ్యవస్థను పరిశీలించారు.. బెంగళూరు కోర్ సిటీలో ఉన్న చెరువులను సందర్శిస్తారు.

లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్తో నేడు రంగనాథ్ సమావేశమవుతారు. కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం-2014పై చర్చించనున్నారు. అనంతరం ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని మార్గందోన్హల్లీ చెరువు, ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన చెరువులను సందర్శించనున్నారు. హైదరాబాద్లోని ఐదు చెరువులను పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణపై బెంగళూరులో అధ్యయనం చేయనున్నారు. రెండు రోజుల పాటు బెంగళూరులో అధ్యయనం చేయనున్న హైడ్రా… ఆ తర్వాత హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, విపత్తు నిర్వహణపై ముందుకు సాగనుంది.
కాగా గురువారం రోజు వారి పర్యటన ఇలా సాగింది.. బెంగళూర్ లో కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ ను సందర్శించారు.. ముందస్తుగా వర్షం సమాచారం ప్రజలకు చేర్చడం. ఎంత మొత్తం వర్షం పడబోతోంది. వరద ముంచెత్తే ప్రాంతలవారిని అలెర్ట్ చేయడం, ట్రాఫిక్ జామ్ అలెర్ట్. ప్రత్యామ్నాయ రహదారులను సూచించే విధానాలపై అధ్యయనం చేశారు..
బెంగళూర్ మేఘసందేశం యాప్ పనిచేసే విధానం అధ్యయనం చేశారు.. ఈ యాప్ ద్వారా యీ ప్రాంతాల్లో ఎంత మొత్తం వర్షం పడుతోంది, వరద, ట్రాఫిక్ జామ్, వడగళ్ల వాన యిలా సమాచారం యిచ్చే విధానం పరిశీలించారు.. .వరద ముప్పు వున్న ప్రాంతాలను అప్రమత్తం చేయడం. వరద కాలువలు ఎంత మొత్తం నీరు వెళ్తోంది. ఎక్కడ చెత్త పేరుకుపోయింది.. తదితర వివరాలను అలెర్ట్ చేసే సెన్సార్ విధానం పై అధ్యయనం చేశారు.. 20 ఏళ్ల డేటాతో ఎన్ని సెంటి మీటర్ల వర్షం పడితే వరద ముప్పు ప్రాంతాలను అంచనా వేయడం తదితర సమాచారం తెలుసుకున్నారు.. కె ఎస్ ఎన్ డీ ఎం సి కేంద్రంలో వర్షపాతం నమోదు, గాలి వేగం, ఉష్ణోగ్రతల వివరాలు చెప్పే వాతావరణ కేంద్రాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.. హైడ్రా అధికారులు రీజినల్ ఫైర్ ఆఫీసర్లు వి. పాపయ్య, ఏ. జయప్రకాష్, ఏఈ నాగరాజు, ఇన్స్పెక్టర్ విజయ్ ఆదిత్య తదితరులు ఈ అధ్యయన బృందంలో ఉన్నారు.