భార్య, కూతురు, మరోవ్యక్తిని కత్తితో పొడిచిన ఉన్మాది..
హాస్పిటల్ కు చేరుకున్న పోలీసులు..
పోలీసులపై కూడా కత్తితో దాడిచేసిన వ్యక్తి..
అరుణాచల్ ప్రదేశ్ లో ఘటన..
ఒక వ్యక్తి ఉన్నాదిగా ప్రవర్తించాడు. హాస్పిటల్లో భార్య, కుమార్తెతోపాటు మరో వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. పోలీసులతోపాటు మరి కొందరిపై కత్తితో దాడి చేశాడు. చివరకు అతికష్టం మీద ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కమెంగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్పాలోని జిల్లా ఆసుపత్రిలో 40 ఏళ్ల నికమ్ సంగ్బియా చెలరేగిపోయాడు. ప్రస్తుతం ఎక్కడా కనిపించని సాంప్రదాయక కత్తి ‘దావో’తో భార్య, కుమార్తె, మరో వ్యక్తిపై దాడి చేశాడు. కత్తితో పలుమార్లు పొడిచి వారిని చంపాడు. అక్కడున్న మరికొందరిపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ హాస్పిటల్కు చేరుకున్నారు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా నికమ్ ఆ కత్తితో దాడి చేశాడు. దీంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. చివరకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని మరో హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ అధికారి తెలిపారు.