Monday, June 23, 2025
Google search engine
HomeUncategorizedపింక్ బాల్ టెస్టులో మరోసారి ఆదుకున్న నితీశ్.. భారత్‌ 180 పరుగులకు ఆలౌట్

పింక్ బాల్ టెస్టులో మరోసారి ఆదుకున్న నితీశ్.. భారత్‌ 180 పరుగులకు ఆలౌట్

భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కూడా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌ రెడ్డి (42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్‌ పేసర్ మిచెల్ స్టార్క్ (6/48) దెబ్బకు భారత టాప్ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. అతడితోపాటు కమిన్స్ 2, స్కాట్ బోలాండ్ 2 వికెట్లు తీశారు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 37, శుభ్‌మన్‌ గిల్ 31, అశ్విన్ 22, రిషభ్‌ పంత్ 21 పరుగులు చేశారు. యశస్వి, హర్షిత్, బుమ్రా డకౌట్‌ కాగా.. విరాట్ కోహ్లీ 7, రోహిత్ 3 విఫలమయ్యారు. సిరాజ్‌ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments