ఎల్బీనగర్:
హయత్ నగర్ కుమ్మరికుంట చెరువు రోడ్డు మీద ప్రయాణం చేయడానికి ప్రజలు ప్రతినిత్యం నరకాయతన పడుతున్న నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శుక్రవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతోని ఈ ప్రదేశానికి తీసుకువచ్చి చెరువు కట్ట రోడ్డును వారికి చూపించారు. ప్రతినిత్యం ఈ రోడ్డు మీద వందలాది వాహనాలు వెళుతున్న నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కావున నూతన రోడ్డు నిర్మాణ పనులు, కట్ట వెడల్పుకు నిధులు మంజూరు చేయాలనీ కోరడమైనది. వెంటనే స్పందించిన జోనల్ కమిషనర్ కట్ట వెడల్పు, నూతన రోడ్డు నిర్మాణ కోసం యుద్ధప్రతిపాదికన నిధులు మంజూరు చేసి నిర్మాణం చెప్పాడుతామని హామీ ఇచ్చారు.


