Monday, June 23, 2025
Google search engine
Homeడివోషనల్అయ్యప్ప భక్తులు ప్రతి బుధవారం ఇది పఠించండి..

అయ్యప్ప భక్తులు ప్రతి బుధవారం ఇది పఠించండి..

అయ్యప్ప సుప్రభాతం స్వామిని కీర్తిస్తూ తెల్లవారు ఝామున పాడే భక్తి గీతం. ఈ స్తోత్రం శ్రీ అయ్యప్ప స్వామి స్వభావం, శక్తి ,యు అనుగ్రహాన్ని స్తుతిస్తుంది. ఈ స్తోత్రం అయ్యప్ప స్వామి యొక్క అపారమైన శక్తి, కరుణ , అనుగ్రహాన్ని ప్రశంసిస్తూ ఉంటుంది. అయ్యప్ప మాల ధరించిన భక్తులు తమ హృదయాలను అయ్యప్ప స్వామికి సమర్పించుకుంటూ సుప్రభాతంతో రోజు ప్రారంభిస్తారు.

శివ పుత్రుడు, విష్ణు పుత్రుడు, శక్తి పుత్రుడు అయిన శ్రీ అయ్యప్ప స్వామి లోకాన్ని రక్షించేందుకు వచ్చాడని భక్తుల విశ్వాసం. అందుకే ఏడాదికి 41 రోజుల పాటూ మండల దీక్ష చేసి స్వామి సన్నిధికి వెళ్లి శబరిమల మకర జ్యోతిని దర్శించుకుంటారు.

అయ్యప్ప సుప్రభాతం భక్తుల్లో ఆధ్యాత్మిక భావన పెంచుతుంది. ఈ స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే తమలో దైవక శక్తిని గుర్తిస్తారు ఉరకల పరుగుల జీవన విధానంలో ఎదుర్కొనే ఒత్తిడి నుంచి ఉపశమనం ప్రసాదిస్తుంది అయ్యప్ప సుప్రభాతం. అయ్యప్ప సుప్రభాతం పఠించడం లేదంటే వినడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ సుప్రభాతం ఆత్మను శుద్ధిచేస స్వామిపై భక్తిని పెంచుతుంది. నిత్యం సుప్రభాతం పఠించేవారు స్వామికి చేరువవుతారు. అయ్యప్ప సుప్రభాతంతో ప్రారంభించే ప్రతి రోజు శుభప్రదంగా ఉంటుందని భక్తుల నమ్మకం. సుప్రభాతాన్ని నిత్యం పఠించడం వల్ల భక్తులు తమ జీవితంలోని అన్ని సమస్యలను దైవిక దృష్టితో చూడగలుగుతారు, జీవతంపై ఆశావాద దృక్పధాన్ని కల్పిస్తుంది. అయ్యప్ప సుప్రభాతం భక్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని..రోగ నిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments