ఊహించని లాభం కలుగుతుంది..!
రోజూ చాలా మంది ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రించే వరకు కూడా టీ లేదా కాఫీలను తెగ తాగేస్తుంటారు. అయితే టీ, కాఫీలను మోతాదులో తాగితే ఆరోగ్యకరమే అయినప్పటికీ వీటిని మరీ అతిగా సేవిస్తే మాత్రం ఆరోగ్యానికి హాని జరుగుతుంది. టీ, కాఫీలను అతిగా సేవించడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయి. అయితే ఇలా జరగకుండా టీ, కాఫీలను తాగాలంటే మీరు రోజూ తాగే వాటిలో పలు మసాలా దినుసులను కలుపుకోవాలి. ఇవి మన వంట ఇంట్లోనే ఉంటాయి. మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మీరు రోజూ తాగే టీ లేదా కాఫీలలో ఈ మసాలా పదార్థాలను కలిపి తాగితే రుచికి రుచి లభించడంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ మసాలా పదార్థాలను టీ లేదా కాఫీలలో కలపడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. ఆరోగ్యంగా కూడా సరిగ్గా ఉంటుంది.
మీరు రోజూ తాగే టీ లేదా కాఫీలో అల్లం కలిపి తాగండి. అల్లాన్ని వేసి అవి తయారు చేసి తాగండి. అల్లంలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. ముఖ్యంగా అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్కను కూడా టీ, కాఫీలలో కలిపి సేవించవచ్చు. దీన్ని మరిగించాల్సిన పనిలేదు. కాస్త పొడి వేసుకుని కలిపి తాగినా చాలు, ప్రయోజనం ఉంటుంది. దాల్చిన చెక్కలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి.
పుదీనా ఆకులను కూడా టీ లేదా కాఫీలో వేసి మరిగించి తాగవచ్చు. పుదీనా ఆకుల్లో మెంథాల్ ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది. వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తుంది. పుదీనాను తీసుకుంటే జీర్ణక్రియ సైతం మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేద పరంగా తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి ఆకుల్లో మన రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. కనుక టీ లేదా కాఫీలో తులసి ఆకులను వేసి మరిగించి తాగవచ్చు. ఈ పానీయాలను సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే గులాబీ పువ్వుల రెక్కలతోనూ టీ, కాఫీ తయారు చేసి తాగవచ్చు.
యాలకులతోనూ టీ లేదా కాఫీ తయారు చేసి తాగవచ్చు. ఈ పానీయాలు ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. అలాగే సోంపు గింజలను కూడా టీ లేదా కాఫీలో వేసి మరిగించి తీసుకోవచ్చు. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.