కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి..
మహేశ్వరం నియోజకవర్గంలోని, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 20వ, 31వ డివిజన్లకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం చేపట్టిన అర్థిక సహాయంలో భాగంగా ఇళ్లు మంజూరు పత్రాలు అందజేశారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఐదు లక్షల రూపాయలు విడుదల చేయడం జరుగుతుందని, ముందుగా లక్ష రూపాయల విడుదల చేసి, దఫాలుగా మిగతా మొత్తం నేరుగా లబ్ధిదారునికి అందజేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి, నారాయణ గౌడ్, చంద్రపాల్ రెడ్డి, పెద్దబావి బాబు, నయనా చారి, సోమేష్ నాయక్, వార్డు ఆఫీసర్ శ్రీకాంత్, వికాస్ కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.