Monday, June 23, 2025
Google search engine
Homeఎడ్యుకేషన్శ్మశానవాటిక పక్కనే విద్యాలయం..

శ్మశానవాటిక పక్కనే విద్యాలయం..

గత కొద్దికాలంగా ఇక్కడే వెలసిన రవీంద్ర భారతి స్కూల్..
విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నడుస్తున్న దౌర్భాగ్యం..
స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..
వెంటనే స్కూల్ ను మూయించాలని డిమాండ్ చేస్తున్న వివిధ సంఘాల నాయకులు..

హయత్ నగర్ మండల కేంద్రంలోని, హయత్ నగర్ గ్రామపరిది కుంట్లూర్ రోడ్డులో స్మశాన వాటిక పక్కనే రవీంద్ర భారతి స్కూల్ గత కోంత కాలంగా విద్యా శాఖ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. స్మశానవాటిక పక్కన ఉన్నందున విద్యార్థులకు, తల్లిదండ్రులకు, స్థానిక ప్రజలకు తీవ్రమైన అసౌకర్యంగా ఉందని వాపోతున్నారు. ఈ విషయం తెలిసిన విద్యా శాఖ అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన రవీంద్ర భారతీ స్కూల్ పై శాఖ పరమైన చర్యలు చేపట్టి, తక్షణమే అక్కడి నుండి వేరొక చోటికి తరలించాలని కోరుతూ సంబంధిత శాఖ అధికారులకు తెలంగాణ బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్, తెలంగాణ బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి శివ బహుజన్, పేదల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గిరిగాని బీక్షపతి గౌడ్ వివిధ సంఘాల నాయకులు తదితరులు కలిసి సంఘాల వారిగా ఏం.ఆర్. ఓ,, ఏం.ఈ. ఓ., డీ.ఈ. ఓ.,ఫైర్ డిపార్ట్మెంట్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చెయ్యడం జరిగింది.

స్కూల్ ను వెంటనే సీజ్ చెయ్యని పక్షం లో అన్ని ప్రజా సంఘలతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments