Monday, June 23, 2025
Google search engine
Homeఆంధ్రప్రదేశ్ఏపీ ఆర్ధిక పరిస్థితులు ఆందోళనకరం..

ఏపీ ఆర్ధిక పరిస్థితులు ఆందోళనకరం..

కూటమి చెబుతున్న విషయాలు అవాస్తవం..
తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ సీఎం వై.స్. జగన్..

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చెబుతున్న విషయాలకు పూర్తి విరుద్దంగా కాగ్‌ నివేదికలు చెబుతున్నాయని శనివారం ట్విటర్‌లో పేర్కొన్నారు. గత ఏప్రిల్‌ మాసంలో జీఎస్టీ వసూళ్లు రూ. 3,354 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసిందని అయితే కాగ్‌ నివేదిక ప్రకారం 24.20శాతం తగ్గిందని ఆరోపించారు.

వాస్తవ విషయాల నుంచి తప్పించుకోవడానికి కూటమి సర్కార్‌ మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందని మండిపడ్డారు. గత సంవత్సరంతో పోల్చి పన్ను ఆదాయాలు, పన్నేతర ఆదాయాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్‌ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తుందని విమర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments