ఎన్నికల నిర్వహణ పనులను వేగవంతం చేసిన బల్దియా..
తెలంగాణాలో ఎక్కడ చూసినా ఈ ఎన్నికపైనే చర్చ..
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో అక్టోబర్ నెలాఖరులో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో షెడ్యూల్ విడుదల కానుండగా, ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది, బల్దియా పనులను వేగవంతం చేసింది. నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, భద్రత కోసం కేంద్ర బలగాలను వినియోగించనున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుంది. అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది.
అక్టోబర్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్లో షెడ్యూల్ విడుదల చేస్తారని సమాచారం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఇక దీనికి సంబంధించి.. ఏర్పాట్లు చేయాల్సిందిగా.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించే ఎన్నికలు కావడంతో.. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం వీటి నిర్వహణ బాధ్యతలను చేపట్టనుంది. ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం.. జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేయడంతో.. బల్డియా ఉప ఎన్నిక పనులను వేగవంతం చేసింది.