ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ లో శ్రీశ్రీశ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలకు కైంకర్యమును అందజేసి దాతృత్వాన్ని చాటుకున్న చిలుక మధుర ఉపేందర్ రెడ్డి. శ్రీ రామకృష్ణా (ఐటీడీఈఎస్ కోపరేటివ్ – సొసైటీ) శ్రీశ్రీశ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం(శ్రీ దుర్గా మల్లిఖార్జున, గణపతి, సుబ్రహ్మణ్య, నవగ్రహ ఆలయములు) దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ బహుళ తదియ తేది: 06-03-2026, శుక్రవారం నుండి బహుళ సప్తమి తేది: 10-03-2026 మంగళవారం వరకు పాంచాహ్నిక దీక్ష పూర్వక వార్షిక బ్రహ్మోత్సవములు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్వామి వార్లకు కైంకర్యమును అక్షరాల యాభై ఒక్క వెయ్యిల (₹51,000/-) రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అడగగానే మా దేవాలయ సముదాయానికి భారీ విరాళాన్ని అందజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు సేవా గుణానికి తర్కాణం, అమ్మవారి ఆశీస్సులతో వారు రాబోయే రోజులలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి, జీవితంలో ఉన్నత విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ఛైర్మన్ తలాటి రమేష్ నేత, డైరెక్టర్స్ దుర్గ ప్రసాద్, సాయి కుమార్, మాలే శ్రీమన్నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


