ఎల్బీనగర్:
సరూర్ నగర్ డివిజన్ లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా సాగింది. “భారత్ మాతాకీ జై”, “వందేమాతరం” నినాదాలతో ర్యాలీ హోరెత్తింది.ఈ ర్యాలీలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాములు యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తూటుపల్లి రవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి కౌన్సిల్ సభ్యుడు బెంగారబోయిన సురేష్ ముదిరాజ్, గజ్జల కృష్ణ, ఆరోబిందో ఐటీఐ కాలేజ్ విద్యార్థులు ఎండీ గణేశ్, ఎలైట్ పారామెడికల్ విద్యార్థులు, చైర్మెన్ జహంగీర్ లోటస్ లాప్, ఇడెన్ టెంపుల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక బీజేపీ నాయకులు సిద్ధు ముదిరాజ్, రాములు గౌడ్, ప్రవీణ్ గౌడ్, కృష్ణంరాజు, నాగరాజు, సూర్యపల్లి శ్రీకాంత్, పొన్నం బద్రి, నవకాంత్ గౌడ్, శైలేష్,త్రివేణి, శ్వేత,సరస్వతి, వెంకట్, మనోహర్, చంటి, శశిధర్ గౌడ్ మామిడి శ్రీకాంత్,ప్రవీణ్, కిషోర్, శివ, సాయి, రాము, రవి, నాగరాజ్, అర్జున్, గణేష్, కాలనీ వాసులతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరంగా ర్యాలీని విజయవంతం చేశారు.


