Wednesday, August 26, 2026
Google search engine
Homeతెలంగాణవిద్యార్థుల ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యం: హైడ్రా రంగనాథ్..

విద్యార్థుల ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యం: హైడ్రా రంగనాథ్..

కళాశాలల యాజమాన్యాలకు హైడ్రా, ఇంటర్ బోర్డు స్పష్టమైన హెచ్చరిక..

హైదరాబాద్:

విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అగ్నిప్రమాదాల నివారణలో ఎలాంటి రాజీ పడకూడదని హైడ్రా మరియు ఇంటర్మీడియట్ విద్యా మండలి సంయుప్తంగా స్పష్టం చేశాయి. నకిలీ అగ్నిమాపక నిరభ్యంతర పత్రాల (ఫైర్ ఎన్.ఓ.సి.) వ్యవహారంపై తీవ్ర దృష్టిసారించిన యంత్రాంగం, సోమవారం కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

*భద్రతా ప్రమాణాలు – శాస్త్రీయ దృక్పథం
అగ్నిప్రమాదాలు సంభవించిన తక్షణమే విద్యార్థులు మరియు బోధనా సిబ్బంది ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి తగిన రక్షణ ఏర్పాట్లు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • అత్యవసర నిష్క్రమణ మార్గాలు (Emergency Exits): భవనాల్లో కచ్చితంగా రెండు వైపులా విశాలమైన మెట్ల మార్గాలు (స్టైర్‌కేసులు) ఉండేలా చూసుకోవాలి. పాత భవనాల విషయంలో స్థల సమస్య ఉంటే, ఇంజనీరింగ్ నిపుణుల సలహాతో పటిష్టమైన ప్రత్యామ్నాయ రక్షణ ఏర్పాట్లను తక్షణమే చేపట్టాలి.
  • వాయు ప్రసరణ మరియు పొగ నియంత్రణ: ప్రమాద సమయంలో దట్టమైన పొగ వ్యాపించకుండా వెంటిలేషన్ వ్యవస్థ, అగ్నిమాపక పరికరాలు (ఫైర్ ఎక్స్టింక్టర్లు, స్ప్రింక్లర్లు) ఎల్లప్పుడూ పనిచేసే స్థితిలో ఉండాలి.

*యాజమాన్యాల సమస్యలపై సానుకూల స్పందన
ఫేక్ ఎన్.ఓ.సి.ల తనిఖీల నేపథ్యంలో యాజమాన్యాలు ఎదుర్కొంటున్న ఇబ్బతులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏ.వి. రంగనాథ్ మరియు ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రీమతి అభిలాష అభినవ్ అడిగి తెలుసుకున్నారు. కళాశాలలను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని తేల్చిచెప్పారు.

  • పునరుద్ధరణ గడువు పెంపు: యాజమాన్యాల అభ్యర్థన మేరకు ఫైర్ ఎన్.ఓ.సి.ల పునరుద్ధరణ (రెన్యూవల్) ప్రక్రియను ప్రతి ఏటా కాకుండా, ఇకపై ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించుకునే వెసులుబాటును కల్పిస్తామని హైడ్రా కమిషనర్ ప్రకటించారు.
  • జరిమానాలపై పునరాలోచన: నకిలీ పత్రాల కారణంగా కళాశాలలకు విధించిన రుసుముల అంశంపై ఇంటర్ బోర్డు సానుకూలంగా పునరాలోచించనుంది. అదే సమయంలో, ఈ అక్రమాలకు పాల్పడిన సూత్రధారులు మరియు పాత్రధారులపై చట్టపరమైన లోతైన దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

*డిజిటల్ విధానంలో సులభతర సేవలు
దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, పూర్తిగా పారదర్శకమైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

  • ఆన్‌లైన్ దరఖాస్తులు: ఎన్.ఓ.సి.ల జారీ, పునరుద్ధరణ మరియు ఫీజుల చెల్లింపులన్నీ డిజిటల్ మాధ్యమంలోనే జరగనున్నాయి. ఇందుకుగాను https:hydraafirenoc.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • పరిధి విస్తృతి: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) ప్రాంతాలన్నింటికీ ఈ ఆన్‌లైన్ విధానం వర్తిస్తుంది. దీనివల్ల యాజమాందాలు నేరుగా హైడ్రా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు.

ఈ సమావేశంలో హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య అగ్నిమాపక నిబంధనలను వివరించగా, ఇంటర్ బోర్డు సంయుక్త కార్యదర్శి శ్రీమతి వసుంధర సమావేశ వివరాలను అందజేశారు. భవిష్యత్తులోనూ ప్రతి విద్యాసంస్థ నిబంధనలను స్వయంగా పరిశీలించుకుని విద్యార్థుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు పిలుపునిచ్చారు.
ఈ వార్తా కథనంపై మీ అభిప్రాయం ఏమిటి?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments