Tuesday, June 24, 2025
Google search engine
HomeUncategorizedవాషింగ్టన్‌ పోస్ట్‌కు ఊహించని షాక్‌..!

వాషింగ్టన్‌ పోస్ట్‌కు ఊహించని షాక్‌..!

ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని వాషింగ్టన్ పోస్ట్ నిర్ణయం..
అధ్యక్ష ఎన్నికల్లో క్విడ్ ప్రోకోకు తావులేదు..
2 లక్షల మందికి పై షబ్ స్క్రిప్షన్స్ రద్దు..

మరో వారంలో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలోకి దిగారు. ఇరువురూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలుపే లక్ష్యంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఈ ఎన్నికల వేళ.. యూఎస్‌కు చెందిన ప్రముఖ వార్తాపత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ కు ఊహించని షాక్‌ తగిలింది.

అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని వాషింగ్టన్‌ పోస్ట్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో వాషింగ్టన్‌ పోస్ట్‌ దాదాపు 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు వాషింగ్టన్‌ పోస్ట్‌ నిర్ణయాన్ని పత్రిక యజమాని, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సమర్థించారు. అధ్యక్ష ఎన్నికల్లో క్రిడ్‌ ప్రోకోకు తావు లేదన్నారు. విశ్వసనీయత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

సోమవారం మధ్యాహ్నం నాటికి 2 లక్షల మందికిపైగా వాషింగ్టన్‌ పోస్ట్‌ డిజిటల్‌ సబ్‌స్క్రిప్షన్‌లన రద్దు చేసినట్లు ఎన్‌పీఆర్‌ మీడియా అవుట్‌లెట్‌ను ఊటంకిస్తూ ఓ నివేదిక తెలిపింది. అన్ని రద్దులు వెంటనే అమలులోకి రావ‌ని ఎన్‌పీఆర్‌ నివేదిక పేర్కొంది. ఇక ఈ సంఖ్య పేపర్ చెల్లింపు సర్క్యులేషన్‌లో ఉన్న 2.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లలో 8 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇందులో ప్రింట్ మీడియా కూడా ఉన్నట్లు పేర్కొంది. అలాగే ప‌లువురు కాలమిస్టులు వాషింగ్టన్ పోస్ట్‌కు రాజీనామా చేసినట్లు ఎన్‌పీఆర్‌ నివేదించింది. అయితే, ఈ నివేదికపై స్పంద‌న‌ కోసం రాయిటర్స్ చేసిన అభ్యర్థనకు వాషింగ్టన్ పోస్ట్ నిరాక‌రించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments