ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ icai.nic.in. ను ఓపెన్ చేయండి.
సీఏ ఫౌండేషన్ లేదా సీఏ ఇంటర్ రిజల్ట్ లింక్ ఓపెన్ చేయాలి.
మీ రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు నమోదు చేసి, ఎంటర్ నొక్కండి.
మీ ఫలితాన్ని చెక్ చేసుకోండి.
సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 30వ తేదీన విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐసీఏఐ వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి లాగిన్ కావాల్సి ఉందని వివరించింది. ఈ పరీక్షలను సెప్టెంబర్లో నిర్వహించిన విషయం విధితమే.
చార్టడ్ అకౌంటెంట్ పౌండేషన్తోపాటు అందుకు సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు బుధవారం అంటే అక్టోబర్ 30వ తేదీన విడుదలవుతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు.. ఈ ఫలితాలను ఆన్లైన్లో అధికారిక వెబ్ సైట్లో లాగిన్ కావడం ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది. అభ్యర్థులు icai.nic.in వెబ్సైట్లో యాక్సెస్ చేయవచ్చునని తెలిపింది. ఈ వెబ్సైట్లో ఫలితాన్ని తెలుసుకోవడానికి అభ్యర్థి అతని/ఆమె రిజిస్ట్రేషన్ నంబర్తోపాటు రోల్ నెంబర్ సైతం నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో చెప్పింది.

సీఏ చదివే వారికి గుడ్ న్యూస్… ఏడాదికి మూడు సార్లు..
అయితే గతేడాది వరకు సీఏ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు మాత్రమే నిర్వహించేవారు. కానీ 2024 – 25 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పరీక్షను ఏడాదికి మూడు సార్లు నిర్వహించాలని ఐసీఏఐ(ICAI) నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 7వ తేదీన జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 430వ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంటే గతేడాది వరకు సీఏ పరీక్షలు రెండు సార్లు అంటే మే లేదా జూన్ మాసంలో ఒకసారి.. నవంబర్ లేదా డిసెంబర్ మాసంలో రెండో సారి జరిగేవి. కానీ ఈ ఏడాది నుంచి సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలు మూడు సార్లు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి, మే లేదా జూన్, అలాగే సెప్టెంబర్ మాసాల్లో ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.