Monday, June 23, 2025
Google search engine
Homeఇంటర్నేషనల్హిందూ దేవాలయాన్ని పునరుద్దరించాలని కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్​ ప్రభుత్వం…

హిందూ దేవాలయాన్ని పునరుద్దరించాలని కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్​ ప్రభుత్వం…

పాకిస్థాన్​ ప్రభుత్వం పంజాబ్​ లోని హిందూ దేవాలయాన్ని పునరుద్దరించాలని కీలక నిర్ణయం తీసుకుంది…ప్రావిన్స్​ నరోవర్​ జిల్లాలోని జఫర్యాల్​ లోని బావోలీ సాహెబ్​ దేవాలయాన్ని పునర్మించేందకు కోటి రూపాయిలను పాకిస్తాన్​ ప్రభుత్వం కేటాయించింది .  ఈ ఆలయం 64 సంవత్సరాలుగా మూసి ఉంచబడింది . ఈ ఆలయాన్ని పునరుద్దరించే బాధ్యతను ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ కు అప్పగించింది.

 అయితే ETPB ఈ దేవాలయాన్ని ఆధీనంలోకి తీసుకున్న తరువాత  మూసివేశారని పాక్​ ధర్మస్థాన్​ కమిటి మాజీ అధ్యక్షుడు రతన్​ లాల్​ ఆర్య తెలిపారు.బావోలీ సాహెబ్​ దేవాలయాన్ని నిర్మించే స్థలానికి నాలుగు వైపులా ప్రహరీగోడను నిర్మించిన తరువాత పాక్ ధర్మస్థాన్ కమిటీకి అప్పగించనున్నారు. నరోవర్​ జిల్లా వ్యాప్తంగా  1,453 హిందువులు ఉన్నప్పటికి ఒక్కటి కూడా హిందూ దేవాలయం లేదు. ప్రస్తుతం నరోవర్​ జిల్లాలోని హిందువులు దేవాలయానికి వెళ్లాలంటే . లాహోర్​ కాని, సియాల్​ కోట్​ గాని వెళ్లాల్సి ఉంది.  ఒకప్పుడు నరోవల్​ జిల్లాలో 45 హిందూ దేవాలయాలు ఉన్నాయి.  వాటిని ఎవరూ పట్టించుకోనే స్థితి లేదు దీంతో శిథిలావస్థకు చేరుకున్నాయి.పాకిస్థాన్​ లో మైనార్టీ వర్గం హిందువులు . ఆ  దేశ వ్యాప్తంగా సుమారు 7.5 మిలియన్ల మంది హిందువులు ఉన్నారని పాక్​ప్రభుత్వం అంచనా.   అయితే ఎక్కువ మంది హిందువులు సింధ్​ ఫ్రావిన్స్​ లో ఉన్నారు. బావోలీ సాహిబ్ హిందూ ఆలయం నిర్మాణం పూర్తై పూర్వ వైభవం పొందితే ఎన్నో ఏళ్ళ ఆశ అయిన స్థానిక హిందువుల కల నెరవేరుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments