పాకిస్థాన్ ప్రభుత్వం పంజాబ్ లోని హిందూ దేవాలయాన్ని పునరుద్దరించాలని కీలక నిర్ణయం తీసుకుంది…ప్రావిన్స్ నరోవర్ జిల్లాలోని జఫర్యాల్ లోని బావోలీ సాహెబ్ దేవాలయాన్ని పునర్మించేందకు కోటి రూపాయిలను పాకిస్తాన్ ప్రభుత్వం కేటాయించింది . ఈ ఆలయం 64 సంవత్సరాలుగా మూసి ఉంచబడింది . ఈ ఆలయాన్ని పునరుద్దరించే బాధ్యతను ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ కు అప్పగించింది.

అయితే ETPB ఈ దేవాలయాన్ని ఆధీనంలోకి తీసుకున్న తరువాత మూసివేశారని పాక్ ధర్మస్థాన్ కమిటి మాజీ అధ్యక్షుడు రతన్ లాల్ ఆర్య తెలిపారు.బావోలీ సాహెబ్ దేవాలయాన్ని నిర్మించే స్థలానికి నాలుగు వైపులా ప్రహరీగోడను నిర్మించిన తరువాత పాక్ ధర్మస్థాన్ కమిటీకి అప్పగించనున్నారు. నరోవర్ జిల్లా వ్యాప్తంగా 1,453 హిందువులు ఉన్నప్పటికి ఒక్కటి కూడా హిందూ దేవాలయం లేదు. ప్రస్తుతం నరోవర్ జిల్లాలోని హిందువులు దేవాలయానికి వెళ్లాలంటే . లాహోర్ కాని, సియాల్ కోట్ గాని వెళ్లాల్సి ఉంది. ఒకప్పుడు నరోవల్ జిల్లాలో 45 హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిని ఎవరూ పట్టించుకోనే స్థితి లేదు దీంతో శిథిలావస్థకు చేరుకున్నాయి.పాకిస్థాన్ లో మైనార్టీ వర్గం హిందువులు . ఆ దేశ వ్యాప్తంగా సుమారు 7.5 మిలియన్ల మంది హిందువులు ఉన్నారని పాక్ప్రభుత్వం అంచనా. అయితే ఎక్కువ మంది హిందువులు సింధ్ ఫ్రావిన్స్ లో ఉన్నారు. బావోలీ సాహిబ్ హిందూ ఆలయం నిర్మాణం పూర్తై పూర్వ వైభవం పొందితే ఎన్నో ఏళ్ళ ఆశ అయిన స్థానిక హిందువుల కల నెరవేరుతుంది.