మన శరీరంలో కిడ్నీలు వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతూ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో కిడ్నీల్లో పేరుకుపోయే స్ఫటికాలు రాళ్లుగా మారుతాయి. అయితే కిడ్నీ స్టోన్లు రావడం సహజమే అయినా ఇవి వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి. నీళ్లను సరిగ్గా తాగకపోయినా, పాలకూర, టమాటా వంటి క్యాల్షియం, ఆగ్జలేట్స్ ఉండే ఆహారాలను తింటున్నా, పలు రకాల మెడిసిన్లను వాడుతున్నా కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే కిడ్నీ స్టోన్లు వస్తే చిన్నవి అయితే డాక్టర్ సలహా మేరకు మందులను వాడితే కరిగిపోతాయి. ఇక డాక్టర్లు రాసిచ్చే మందులతోపాటు పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల కూడా కిడ్నీ స్టోన్లను కరిగించుకోవచ్చు.
ఒక టీస్పూన్ మెంతులను రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ మెంతులను తిని ఆ నీళ్లను తాగాలి. దీని వల్ల కిడ్నీల్లోని రాళ్లు సహజసిద్ధంగా కరిగిపోతాయి. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. కిడ్నీ స్టోన్లను కరిగించడంలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక తులసి ఆకుల రసం కూడా కిడ్నీ స్టోన్లను కరిగిస్తుంది. ఒక టీస్పూన్ తులసి ఆకుల రసంలో అంతే మోతాదులో తేనె కలిపి రోజూ ఉదయాన్నే తాగాలి. కనీసం 6 నెలల పాటు ఇలా చేస్తే కిడ్నీల్లోని రాళ్లను కరిగించుకోవచ్చు.
వేపాకులను కాల్చి బూడిద చేయాలి. దీన్ని ఒక రోజు అలాగే నిల్వ ఉంచాలి. తరువాత ఒకటిన్నర గ్రాముల పొడిని తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగాలి. రెండు పూటలా ఇలా తాగుతుంటే రాళ్లు కరిగిపోతాయి. అలాగే కొత్తిమీర ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు ఒకసారి తాగుతుంటే కిడ్నీల్లో ఉండే స్టోన్స్ కరిగిపోతాయి.
పొద్దు తిరుగుడు చెట్టు వేళ్ల పొడి పావు టీస్పూన్ తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలపాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగుతుంటే ఫలితం ఉంటుంది. అరకేజీ పెసర పప్పును లీటర్ మంచినీళ్లలో కలిపి కాచి తరువాత పైన తేరిన కట్టును తాగితే రాళ్లు పడిపోతాయి. సీమగోరింట విత్తనాలు 1 నుంచి 2 గ్రాములు తీసుకుని ప్రతి రోజు ఉదయం మంచినీటితో కలిపి సేవిస్తుంటే రాళ్లు కరిగిపోతాయి.
పుచ్చకాయ జ్యూస్ను రోజూ ఒక గ్లాస్ మోతాదులో తాగుతుంటే కిడ్నీల్లోని రాళ్లు కరిగిపోతాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో పుచ్చకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. పుచ్చకాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీలకు మేలు చేస్తుంది. పుచ్చకాయను తింటే శరీరంలోని యాసిడ్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. దీంతో కిడ్నీల్లోని రాళ్లు సులభంగా కరిగిపోతాయి.
నిమ్మకాయ రసంలో సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఈ రసంలో విటమిన్ సి ఉంటుంది. ఇవి క్యాల్షియం ఆధారిత కిడ్నీ స్టోన్లను కరిగించడంలో ఎంతగానో సహాయపడతాయి. కనుక ఒక గ్లాస్ నీటిలో కాస్త నిమ్మరసం కలిపి రోజూ ఏదో ఒక సమయంలో తాగుతుండాలి. గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు ఉదయం పరగడుపున కాకుండా వేరే ఏదైనా సమయంలో ఈ నీళ్లను తాగాలి. దీంతో ఫలితం ఉంటుంది. ఇలా పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించి కిడ్నీ స్టోన్లను కరిగించుకోవచ్చు.