దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో విలవిలాడుతోంది. అయితే గత కొన్ని రోజులుగా ఇక్కడ వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. గాలి నాణ్యత సూచీ అధ్వాన స్థితిలో నమోదవుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యత 355 గా నమోదైంది.అశోక్ విహార్ వద్ద 367, ద్వారకా సెక్టార్ 8 వద్ద 390, డీటీయూ వద్ద 366, జహంగిరిపురిలో 417, లోధి రోడ్డులో 313, ముండ్కాలో 404, నజఫ్గఢ్లో 355, నరేలాలో 356, ఆనంద్ విహార్లో 403, ప్రతాప్గంజ్లో 371, పూసాలో 320, ఆర్కే పురంలో 365, రోహిణిలో 415, షాదీపూర్లో 359, వివేక్ విహార్లో ఏక్యూఐ లెవల్స్ 385గా రికార్డు అయ్యాయి .

రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో ఢిల్లీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్వాస తీసుకోవడం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాజధానిలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా మారుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి దీర్ఘకాలిక పరిష్కారాన్ని చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.