ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన జీఎస్ఐ డివిజన్ జెఏసి నాయకులు
ఎల్.బి.నగర్:
జీఎస్ఐ డివిజన్ పరిధిలోని కాలనీల్లో ఎదురవుతున్న తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ‘జీఎస్ఐ డివిజన్ 23 కాలనీల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)’ ప్రతినిధులు ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తాగునీటి సమస్యపై రూపొందించిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు.
రౌక్ టౌన్ కాలనీ ప్రాంతంలో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ అత్యవసరం:
ఈ సందర్భంగా జెఏసి ప్రతినిధులు మాట్లాడుతూ… ఈ ఏడాది నీటి ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల 23 కాలనీల నివాసితులకు తాగునీటి సరఫరా సరిగ్గా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని శాసనసభ్యుడి దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో ఇటువంటి తాగునీటి కష్టాలు పునరావృతం కాకుండా ఉండాలంటే రౌక్ టౌన్ ప్రాంతంలో నూతనంగా ఒక ఊర్థ్వ ముఖ నీటి సామర్థ్యం ఎక్కువగా ఉన్న తొట్టి ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజ్ఞప్తి చేశారు.
*ప్రజాప్రతినిధుల సహకారంతో సమస్య పరిష్కరిస్తాం: శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.
జెఏసి విజ్ఞప్తిపై శాసనసభ్యుడు సానుకూలంగా స్పందించారు. జీఎస్ఐ డివిజన్ పరిధిలోని కాలనీల తాగునీటి సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు.
“తాగునీటి సమస్య కాలనీవాసులందరి ఉమ్మడి సమస్య. రౌక్ టౌన్ ప్రాంతంలో ఊర్థ్వ ముఖ నీటి తొట్టి నిర్మాణానికి ఎంపీ నిధులు (MP Funds) సమకూరితే పనులను త్వరితగతిన పూర్తి చేయవచ్చు. కాలనీ కమిటీల ప్రతినిధులు, ప్రజలు ఐక్యంగా సహకరిస్తే ఈ ప్రాజెక్టును త్వరలోనే కార్యరూపంలోకి తెస్తాం.”
*దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు
ఈ కార్యక్రమంలో ‘జీఎస్ఐ డివిజన్ 23 కాలనీల జాయింట్ యాక్షన్ కమిటీ’ ముఖ్య సభ్యులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


