ఎల్బీనగర్:
ఎల్బీనగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లైఫ్ సేవర్స్ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే నీటి కాలుష్యాన్ని వివరిస్తూ, విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లైఫ్ సేవర్స్ ఫౌండర్ శివ నేత, బృంద సభ్యులు పోస్టర్లను ఆవిష్కరించి, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇకపై మట్టి విగ్రహాలనే ఉపయోగిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.


