Thursday, August 20, 2026
Google search engine
Homeతెలంగాణఎల్బీనగర్ నియోజకవర్గంలో చెరువులకు మహర్దశ: నిధులు మంజూరు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో చెరువులకు మహర్దశ: నిధులు మంజూరు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి: మధుయాష్కీ గౌడ్.

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు చెరువుల అభివృద్ధి మరియు సుందరీకరణ కోసం నిధులు మంజూరయ్యాయి. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ నిధులను సాధించారు. స్థానిక ప్రజల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.

*క్షేత్రస్థాయి పరిశీలన మరియు ప్రజా సమస్యల గుర్తింపు
ఇటీవల నియోజకవర్గంలోని బండ్లగూడ, నాగోల్ చెరువులతో పాటు సాహెబ్ నగర్, బీఎన్ రెడ్డి డివిజన్లలోని కాప్రాయి చెరువును మధుయాష్కీ గౌడ్ సందర్శించారు. అంతకుముందు బాతుల చెరువు, కుమ్మరి కుంటలను కూడా పరిశీలించి, చెరువుల దుస్థితిపై అధికారులతో సమీక్షించారు.
చెరువు కట్టలపై వాకింగ్ ట్రాక్‌లు లేకపోవడం, ఉన్నచోట కూడా అధ్వాన్నంగా మారడంతో స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా గుర్తించారు. రాత్రి సమయాల్లో కట్టలపై సరైన లైటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నట్లు స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

*అధికారులతో చర్చలు – నిధుల మంజూరు
ప్రజల ఇబ్బందిని గమనించిన మధుయాష్కీ గౌడ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ వికాస్ మహతోతో సమావేశమై చెరువుల ప్రస్తుత పరిస్థితిని వివరించారు. చెరువు కట్టల అభివృద్ధి, సుందరీకరణ పనులకు వెంటనే నిధులు కేటాయించాలని కోరారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు ప్రశాంతంగా వాకింగ్ చేసుకునేందుకు వీలుగా ట్రాక్‌లు, వీధి దీపాలు, మరియు కూర్చోవడానికి బెంచీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ మేరకు స్పందించిన జోనల్ కమిషనర్ వికాస్ మహతో, పలు చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

  • బండ్లగూడ చెరువు: కట్టపై వాకింగ్ ట్రాక్, లైటింగ్ మరియు బెంచీల ఏర్పాటు కోసం రూ. 41 లక్షలు మంజూరయ్యాయి.
  • నాగోల్ చెరువు: కట్టపై వాకింగ్ ట్రాక్, లైటింగ్ మరియు బెంచీల ఏర్పాటు కోసం రూ. 64 లక్షలు కేటాయించారు.
  • మన్సూరాబాద్ చిన్న చెరువు: వాకింగ్ ట్రాక్ మరియు సుందరీకరణ పనుల నిమిత్తం రూ. 10 లక్షలు మంజూరయ్యాయి.
  • సాహెబ్ నగర్ కాప్రాయి చెరువు మరియు హయత్ నగర్ బాతుల చెరువు: కట్టలపై వాకింగ్ ట్రాక్, లైటింగ్, బెంచీల ఏర్పాటు కోసం రూ. 46 లక్షలు విడుదలయ్యాయి.
    ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభమై, ఎల్బీనగర్ నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments