. తక్కువ ప్రదేశాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం.
. పర్వత ప్రాంతాలు, వాగులు, వంకల దగ్గర వెళ్లరాదు.
. రైతులు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంగా వాయుగుండంగా బలపడింది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు – పుదుచ్చేరి – దక్షిణ ఆంధ్ర కోస్తా తీరం మధ్య ఈరోజు సాయంత్రం నాటికి తీరం దాటే అవకాశం ఉంది.
ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కడప జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాల వద్ద వరద తీవ్రంగా పెరగడంతో అధికారులు ప్రజలు అటువైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
☁️ తెలంగాణలో కూడా వర్ష సూచనలు
వాయుగుండం ప్రభావం తెలంగాణలో కూడా కనిపిస్తోంది. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


