Thursday, July 10, 2025
Google search engine
Homeనేషనల్ప్రధాని మోడీకి కృతజ్ఞతలు..

ప్రధాని మోడీకి కృతజ్ఞతలు..

పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం
ప్రధాని ఎంతో విలువైన సమయాన్ని కేటాయించారన్న పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా పవన్ కలిశారు. ప్రధానితో సమావేశంపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఊపిరి సలపనంత బిజీ షెడ్యూల్ లోనూ ప్రధాని ఎంతో విలువైన సమయాన్ని తమ కోసం కేటాయించారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

“ప్రధాని మోదీని నేను మొదటిసారిగా గాంధీనగర్ లో కలిశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయనతో ప్రతి సమావేశం ఎంతో సుహృద్భావ వాతావరణంలో జరిగేది. ప్రతి సమావేశం తర్వాత కూడా ఆయన పట్ల ఆరాధనా భావం కలిగేది. దేశం పట్ల ఆయన ప్రేమ, నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం” అని పవన్ కల్యాణ్ వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments