బడంగ్పేట్:
బడంగ్పేట్ సర్కిల్-16 కార్యాలయంలో ప్రముఖ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో కాళోజీ చిత్రపటానికి డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సమాజ చైతన్యానికి కాళోజీ రచనలే ఊపిరి
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు కేవలం కవి మాత్రమే కాదని, తెలంగాణ ఉద్యమాలకు, ప్రజా పోరాటాలకు నిలువెత్తు రూపమని కొనియాడారు. తన గళంతో, కలంతో పాలకుల అన్యాయాలను నిలదీస్తూ ప్రజల్లో విప్లవ చైతన్యం రగిలించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తన రచనల ద్వారా బలంగా వినిపించి, ప్రజా కవిగా చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తుచేశారు. అన్యాయాన్ని ఎదిరించే తత్వాన్ని తన కవిత్వం ద్వారా భావితరాలకు అందించిన మహనీయుడని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్-16 అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.


