Thursday, August 6, 2026
Google search engine
Homeతెలంగాణ22ఏ భూముల పేరిట అర్హులకు అన్యాం జరగబోదు:

22ఏ భూముల పేరిట అర్హులకు అన్యాం జరగబోదు:

  • రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ
  • సామాన్యుల హక్కులకు భరోసా..
  • ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా అడుగులు: సీసీఎల్‌ఏ పరిధిలో ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్:

రాష్ట్రంలో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత స్పష్టమైన, పారదర్శకమైన విధానాన్ని అవలంబిస్తోందని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క సెంటు ప్రైవేట్ భూమిని కూడా కొత్తగా ఈ జాబితాలో చేర్చలేదని ఆయన స్పష్టం చేశారు. పేదలకు, నిజమైన భూహక్కుదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడటమే సర్కారు ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, విధానపరమైన అంశాల విశ్లేషణ క్రింది విధంగా :

*వాస్తవాల పరిశీలన – అవాస్తవాల ఖండన:

  • వివాదాలు లేని ప్రైవేట్ భూములను ఉద్దేశపూర్వకంగానే నిషేధిత జాబితాలో చేర్చారంటూ వివిధ మాధ్యమాల్లో వస్తున్న ప్రచారంలో ఎలాంటి సత్యం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు.
  • ప్రభుత్వ ఆలోచనలను అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిగా అవగతం చేసుకొని, అదే స్ఫూర్తితో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.

న్యాయం – రక్షణల సమతుల్యత

  • అర్హుల హక్కుల పరిరక్షణ: చట్టబద్ధమైన పత్రాలు కలిగి ఉండి, ఎలాంటి వివాదాలు లేని ప్రైవేట్ భూముల యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే సాంకేతిక అడ్డంకులను తొలగించాలి.
  • ప్రభుత్వ భూముల రక్షణ: ప్రజాధనానికి, ప్రభుత్వ ఆస్తులకు ప్రతీక అయిన ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు, చట్టవిరుద్ధ లావాదేవీలు మరియు బినామీ రిజిస్ట్రేషన్లు జరగకుండా జిల్లా కలెక్టర్లు ఉక్కుపాదం మోపాలి.

*గడువులోగా అర్జీల పరిష్కారం:

  • నిర్ణీత కాలపరిమితి: హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం 22ఏ దరఖాస్తులపై ఎలాంటి జాప్యం లేకుండా కేవలం 45 రోజుల్లోపే సమగ్ర విచారణ పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకోవాలి.
  • ప్రజావాణి దరఖాస్తులు: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి విజ్ఞప్తిపై ప్రత్యేక దృష్టి సారించి, క్షేత్రస్థాయి పరిశోధన ద్వారా అర్హులకు సత్వర న్యాయం చేకూర్చాలి.
  • అధికార వికేంద్రీకరణ: తహసీల్దార్, ఆర్డీవో, సబ్ కలెక్టర్ స్థాయిల నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు వచ్చే ప్రతి ఫిర్యాదును రికార్డుల ఆధారంగా శాస్త్రీయంగా పరిశీలించాలి. తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారం కలెక్టర్లకే ఉంటుందని, వారు ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments