Monday, February 23, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్జాఫర్ ఎక్సప్రెస్ పై దుండగుల దాడి..

జాఫర్ ఎక్సప్రెస్ పై దుండగుల దాడి..

నెలన్నర వ్యవధిలో ఇది ఆరో దాడి
క్వెట్టా నుంచి పెషావర్ వెళుతుండగా బోలన్ పాస్ వద్ద కాల్పులు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మరోసారి దాడికి గురైంది. క్వెట్టా, సిబి మధ్య గత నెలన్నర రోజుల్లో ఈ ప్రయాణికుల రైలుపై దాడి జరగడం ఇది ఆరోసారని స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. ఈ వరుస దాడులతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

సోమవారం క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని బోలన్ పాస్ సమీపంలోని ఆబ్-ఇ-గమ్ వద్ద సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. రైలులో ఉన్న రైల్వే పోలీస్, ఇతర భద్రతా సిబ్బంది వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు.

గతంలోనూ ఇదే రైలుపై అనేకసార్లు దాడులు జరిగాయి. అక్టోబర్ 7న సింధ్ ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు గాయపడ్డారు. సెప్టెంబర్ 24న బలూచిస్థాన్‌లోని మస్తుంగ్ ప్రాంతంలో జరిగిన మరో పేలుడులో 12 మంది గాయపడగా, రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.

ఈ ఏడాది మార్చిలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)కి చెందిన ఉగ్రవాదులు ఇదే రైలును హైజాక్ చేసి, 400 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. 24 గంటల తర్వాత ఈ హైడ్రామా ముగియగా, 20 మంది భద్రతా సిబ్బందిని చంపినట్లు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments