ఎల్బీనగర్:
తొలి దశ జనగణన నేటి నుండి జూన్ 9 వరకు నిర్వహించడం జరుగుతుంది. దాని సందర్బంగా హయత్ నగర్ సర్కిల్ పరిధిలో వివేకానంద పార్క్, వనస్థలిపురం నందు వాకర్లకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు వివేకానంద పార్క్, వనస్థలిపురం నుండి రెడ్ వాటర్ ట్యాంక్ వరకు మరియు రెడ్ వాటర్ ట్యాంక్ నుండి వివేకానంద పార్క్, వనస్థలిపురం వరకు 2 కిలోమీటర్ల 2 కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో చార్జ్ జనగణన అధికారి & ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ దినేష్ సింగ్, ఇంచార్జి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నర్సింగ్ రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సాయి తరుణ్, లక్ష్మీ దీపక్, టాక్స్ ఇన్స్పెక్టర్స్ సుధాకర్, నాగయ్య, ఆయూబ్ ఖాన్, జాహీద్, ఆంజనేయులు, బిల్ కలెక్టర్లు శివరాజ్, విశ్వజిత్ రెడీ, శిరీష యాదవ్, అర్చన, మహేష్, శానిటరీ జవాన్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు మరియు రిసోర్స్ పర్సన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


