అయితే ఒక్కసారి అతని గురించి చదవండి.
ఈ గణిత మేధావి పేరు వశిష్ట నారాయణ్ సింగ్.
1961 లో బీహార్ బోర్డ్ నిర్వహించిన మెట్రిక్యులేషన్ పరీక్షల్లో టాపర్ గా నిలిచాడు.
తర్వాత వశిష్ట నారాయణ సింగ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి గణిత శాస్త్రంలో పీహెచ్ డీ పట్టాను పొంది, నాసా లో అసిస్టెంట్ సైంటిస్ట్ ప్రొఫెసర్ గా ఉద్యోగంలో చేరాడు. మన దేశం మీద ఎంతో అభిమానంతో లక్షలాది రూపాయల వేతనాన్ని , సర్వ సదుపాయాలనూ వదిలేసి అమెరికా నుండి ఇక్కడికొచ్చారు. 1972 లో ఇండియాకు తిరిగి వచ్చి ఐ ఐ టి, ఖరగ్పూర్ లో అధ్యాపకుడిగా, ఆ తర్వాత టి ఐ ఎఫ్ ఆర్, ముంబై మరియు కోల్ కత్తాలలో ఉద్యోగం చేసారు.
ఎందరో విద్యార్థులను గణిత మేధావులుగా తీర్చిదిద్దారు. చాలా మంది జీవితాలను ఉన్నత స్థానాల్లో ఉంచారు. కానీ 1977 లో మొదటిసారిగా ఆయన మానసిక రుగ్మతకు గురయ్యాడు. స్క్రిజోపీనియా అనే జబ్బుకు దాదాపుగా పది సంవత్సరాల పాటు కాంకేలో ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. కానీ ఆయన జబ్బుకు సరైన వైద్యం అందలేదు. వైద్యుల నిర్లక్ష్యం ఆయన పాలిట శాపంగా మారింది. దానితో ఆయన 1988 లో మానసిక వైకల్యంతో ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు.. ఎంతగా ప్రయత్నించినా ఆయన ఆచూకీ ఎవరికీ దొరకలేదు.

చివరికి ఆయన 1992 లో చిరిగిన దుస్తుల్లో, మాసిన గడ్డంతో అత్యంత దయనీయ పరిస్థితుల్లో బీహార్ లోని శివాన్ లో కనిపించారు. తమ జీవితాలకు వెలుగులు అందించిన ఆయనను గుర్తించిన విద్యార్థులు ఎంతో తల్లడిల్లిపోయారు. ఆయన మానసిక పరిస్థితిలో కొంచమైనా మార్పు వస్తుందని , ఆయనను గతంలో తాము చూసిన ప్రొఫెసర్ లాగానే చూడాలని .. ఒక వైపు వైద్యం చేయిస్తూనే , ఆయన కోసం ప్రత్యేక ఇంటిని ఏర్పాటు చేసి , అందులో ఒక స్టడీ టేబుల్ ,ఒక బోర్డును, లైబ్రరీని , అన్ని రకాల బుక్స్ ను సమకూర్చి , ఆయన పూర్తిగా కంఫర్ట్ గా ఉండేలా చేసి తమ గురుభక్తిని చాటుకున్నారు… దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి వశిష్ట నారాయణ్ సింగ్ గారి పరిస్థితి తలుచుకుంటే, జీవితంలో ఎన్ని రకాల మలుపులు ఉంటాయో అని మనసుకు ఎంతో బాధ కలుగుతుంది.