- అదే పనిలో నిమగ్నమైన హైడ్రా..
- చెరువుల పునరుజ్జీవనంపై దృష్టి..
- ప్రగతి నగర్ చెరువునుంచి శ్రీకారం చుట్టిన అధికారులు..
ఇప్పటివరకు చెరువులను ఆక్రమించి అక్రమానిర్మాణాలు చేసిన వారిని టార్గెట్ చేసిన హైడ్రా.. ఆ నిర్మాణాలను కూల్చివేసింది.. ఎన్ని అవాంతరాలు, ఎన్ని విమర్శలు ఎదురైనా.. హైడ్రా తనపని తాను చేసుకుంటూ వెళ్ళింది.. కాగా ఇప్పుడు కూల్చివెతల వల్ల మిగిలిపోయిన వ్యర్ధాలను తొలగించే పనిలో పడింది.. చెరువులను పునరుజ్జీవనంపై దృష్టి పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు..
గత కొద్ది రోజులుగా నగర పరిధిలోని చెరువల ఆక్రమణలను తొలగించిన హైడ్రా ఇప్పుడు ఆయా చెరువుల పునరుజ్జీవనంపై దృష్టి పెట్టింది. తొలుత నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతీనగర్కు చేరువలో ఉన్న ఎర్రకుంట చెరువుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట చెరువు, ఎఫ్టీఎల్ లో నిర్మించిన 5 అంతస్తుల, 3 భవనాలను ఆగస్టు 14న కూల్చివేతలు జరిపిన విషయం విధితమే. కూల్చిన అనంతరం నిర్మాణానికి వాడిన ఐరన్తో పాటు.. ఉపయోగపడే ఇతర సామగ్రిని తీసుకెళ్లి నిర్మణ వ్యర్థాలను అక్కడే వదిలేశాడు నిర్మాణదారుడు. దీంతో వ్యర్థాలను తొలగించని నిర్మాణదారుడికి నోటీసులచ్చి.. ఎర్రకుంటలో గుట్టలుగా పడి ఉన్న నిర్మాణ వ్యర్థాలను పూర్తిగా తొలగించే పనులను ప్రారంభించింది హైడ్రా. మరో రెండు మూడు రోజుల్లో పనులు పూర్తి అయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు..

నిర్మాణ వ్యర్థాలను తొలగించిన తర్వాత హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఎర్రకుంట చెరువుకు పునరుజ్జీవనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు హైడ్రా అధికారులు. వచ్చిన ఫిర్యాదు మేరకు చెరువులలో అక్రమ నిర్మాణాలను తొలగించడమే కాదు.. అక్కడ నిర్మాణ వ్యర్థాలను తరలించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. నగర పరిధిలోని చెరువులలో అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు వ్యర్థాలను పూర్తిగా తరలించి.. ఆయా చెరువులకు వరుస క్రమంలో పునరుజ్జీవనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు..