పటాన్చెరు:
పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాయి రాం కాలనీలో MDR యువసేన సభ్యుడు సాయి ముదిరాజ్ నూతనంగా ప్రారంభించిన “సంప్రదయని ఈవెంట్ ప్లానర్స్” షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ హాజరై, కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాపారాల స్థాపన ద్వారా స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలు విస్తరించడమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి దోహదం జరుగుతుందని తెలిపారు. సాయి ముదిరాజ్ భవిష్యత్తులో మరింత విజయాలు సాధించి, తన వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.


