*వనస్థలిపురం:
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల (75) గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
*సందర్శనార్థం భౌతికకాయం ఉంచిన వృద్ధాశ్రమం
పావలా శ్యామల పార్థివదేహాన్ని వనస్థలిపురంలోని సామాజిక కార్యకర్త పెద్ది శంకర్ నిర్వహిస్తున్న ‘రెడీ టూ సర్వ్ ఫౌండేషన్’ (ఉచిత వృద్ధాశ్రమం) కు తరలించారు. ఈ రోజు (జూలై 28) మధ్యాహ్నం 3:00 గంటల నుంచి రేపు బుధవారం (జూలై 29) మధ్యాహ్నం 12:00 గంటల వరకు ప్రజలు, సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
*ప్రముఖుల నివాళులు – అంత్యక్రియలు
వార్త తెలిసిన వెంటనే నటి కరాటే కల్యాణి, ‘మా’ జనరల్ సెక్రటరీ రఘుబాబు తదితరులు ఆసుపత్రికి చేరుకుని ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. పావలా శ్యామల అంత్యక్రియల పూర్తి బాధ్యతలను ‘రెడీ టూ సర్వ్ ఫౌండేషన్’ నిర్వాహకులు స్వీకరించారు. రేపు మధ్యాహ్నం 12:00 గంటల తర్వాత వనస్థలిపురంలోని స్థానిక స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సమాచారం మరియు సంప్రదింపుల వివరాలు: స్థలం: రెడీ టూ సర్వ్ ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్, వనస్థలిపురం
*నిర్వాహకులు (పెద్ది శంకర్): 97012 95527



