Thursday, July 23, 2026
Google search engine
Homeతెలంగాణ*ఆందోళనకారులపై చర్యల్లేవంటేనే దీక్ష విరమణ!

*ఆందోళనకారులపై చర్యల్లేవంటేనే దీక్ష విరమణ!

  • *కేంద్రానికి పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టమైన ప్రతిపాదన
  • *సీజేపీ నాయకులు, యువతపై చట్టపరమైన వేధింపులు వద్దని లేఖ
  • *నీట్ వివాదం, జవాబుదారీతనంపై పార్లమెంట్‌లో చర్చకు మంత్రుల సానుకూలత?
  • *కలవడానికి వచ్చిన ఎంపీల అడ్డుకట్ట.. 50 మంది ప్రజాప్రతినిధుల మద్దతు లేఖ అందజేత
  • *లడఖ్ పోరాటం నుండి ఢిల్లీ పీఠం వరకు పట్టువదలని పోరు!

ఢిల్లీ వీధుల్లో హక్కుల పోరాటం కాదు, సర్కారువారి సాకులు, సర్కస్ ప్రదర్శనలు సాగుతున్నాయి! రోగమొచ్చినా లడఖ్ ముద్దుబిడ్డ సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష వీడకపోవడంతో పీఠం కింద నీళ్లు కదులుతున్నాయి. కేసుల పేరుతో యువతపై ఖాకీ వేధింపులు ఆపితేనే దీక్ష విరమిస్తానంటూ ఆయన వేసిన ఎత్తుకు, “చర్చలు జరుపుతాం, నీట్ పై మాట్లాడతాం” అంటూ మంత్రుల బృందం ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఎంపీలను అడ్డుకోవడం, ప్రతిపక్షాల మద్దతు లేఖలు ఇవ్వడం… ఇలా ఏటూ తేలని ఈ రాజకీయ నాటకంలో గెలిచేది ప్రజాశక్తా, లేక గద్దెనెక్కిన ప్రభుత్వ భీష్మించుకునే ధోరణ్యా?

*న్యూఢిల్లీ

హక్కుల సాధన కోసం సాగుతున్న ప్రజాపోరాటంలో రాజీపడేదే లేదని పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఆమరణ నిరాహార దీక్షను విరమించేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఓ కీలకమైన షరతు విధించారు. ఉద్యమంలో పాల్గొన్న సీజేపీ ఆందోళనకారులు, యువతపై ఎలాంటి చట్టపరమైన, పోలీసు చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా హామీ ఇస్తేనే తాను దీక్ష విరమిస్తానని తేల్చిచెప్పారు.
ప్రస్తుతం తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆయన తన నిరాహార దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో ఆయన అనుచరులతో పాటు, నిరసనను శాంతింపజేసేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రులు ఆసుపత్రికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు.

*మంత్రులకు విజ్ఞప్తి.. లేఖ ద్వారా డిమాండ్లు!
ప్రభుత్వ ప్రతినిధులు దీక్ష విరమించాలని కోరిన నేపథ్యంలో సోనమ్ వాంగ్‌చుక్ స్పందిస్తూ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు లేఖ రాశారు.

*ప్రజానుకూల డిమాండ్: ఉద్యమంలో పాల్గొన్న యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయబోమని హామీ ఇవ్వాలని కోరారు.

*మంత్రుల సానుకూలత: తనను పరామర్శించిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ప్రభుత్వం నీట్ వివాదంపై జవాబుదారీగా ఉండేందుకు, పార్లమెంట్‌లో చర్చించేందుకు అంగీకరించిందని వెల్లడించారు.

*బలప్రయోగం వద్దు: ఆందోళనకారులను అణచివేసేందుకు ఇకపై పోలీసు బలగాలను ఉపయోగించకూడదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

*రాజకీయం వేడెక్కింది.. ఎంపీల పరామర్శకు అడ్డంకులు!
వాంగ్‌చుక్ దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఆసుపత్రిలో ఉన్న ఆయనను పరామర్శించేందుకు బయలుదేరిన ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. నిరసనకారులకు మద్దతుగా దాదాపు 50 మంది ఎంపీలు సంతకాలు చేసిన ఒక మద్దతు లేఖను ప్రతిపక్ష నాయకులు సోనమ్ వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలికి స్వయంగా అందజేశారు.
ప్రజా ఉద్యమాలను అణచివేయడం సరికాదని, వెంటనే సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్లను పరిష్కరించి ఆయన ప్రాణాలను కాపాడాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments