హాట్ టాపిక్ గా మారిన వార్త..
త్రివిక్రమ్ చివరి చిత్రం గుంటూరు కారం..
టాలీవుడ్లో మరో కొత్త కాంబో తెరపైకి రాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందనే వార్తలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ క్రేజీ కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ చివరి చిత్రం ‘గుంటూరు కారం’ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో సస్పెన్స్ కొనసాగింది. మొదట అల్లు అర్జున్తో సినిమా చేయాలనుకున్నప్పటికీ, బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమాతో బిజీగా ఉండటంతో, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఈ గ్యాప్లో త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ తో ఒక కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని కూడా వార్తలు వచ్చాయి.
ఇదిలావుంటే తాజా సమాచారం ప్రకారం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు త్రివిక్రమ్ రామ్ చరణ్ కోసం ఒక కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ కథను చరణ్కు వినిపించగా, ఆయన కూడా ఓకే చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ చిత్రానికి పవన్ కళ్యాణే నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ‘పెద్ది’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చరణ్ కమిట్ అయ్యారు. అయితే, సుకుమార్ తన స్క్రిప్ట్ వర్క్కు ఎక్కువ సమయం తీసుకుంటున్నందున, ఈ గ్యాప్లో త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి చరణ్ ఆసక్తి చూపిస్తున్నారని టాక్.
త్రివిక్రమ్, రామ్ చరణ్ మధ్య త్వరలోనే ఒక అధికారిక సమావేశం జరగనుందని, ఈ ప్రాజెక్ట్ పై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే, 2027 లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతుందా లేదా చూడాలి.