కమిషనర్ పీ. సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహణ..
బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయంలో సమస్తే స్కీం సమావేశం..
కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళిక లో భాగంగా గురువారం రోజు బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ పి. సరస్వతి అధ్వర్యంలో 11వ రోజు కార్యక్రమంలో భాగంగా నవజీన ఆర్గనైజేషన్ వారు సమావేశం ఏర్పాటు చేసిన నమస్తే స్కీం కార్యక్రమంలో సీడీఎంఏ జాయింట్ డైరక్టర్ బి.సంధ్య పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లడాతూ.. వ్యర్ధాలను సేకరించే వారికి ప్రభుత్వం ద్వారా వచ్చిన స్కీమ్ భద్రత అండ్ నైపుణ్యాలు, సామాజిక రక్షణకు పాప్యత మౌలిక సదుపాయలకు ఆర్థిక సాహయనికి, ప్రతి ఒక్కరు సద్వనియోగం చేసుకోవాలని చెప్పడం జరిగినది.. అలాగే ఈ స్కీము ప్రతి ఒక్కరికి ఉచితంగా అందుబాటులో ఉంటుంది.. ఇది వారి వారి కుటుంబసభ్యులకు ఉపయోగపడుతుంది.. పారిశుధ్య కార్మికులకు ఆయుష్మాన్ భారత్ కార్డు 5 లక్షల కార్డులను జాయింట్ డైరక్టర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగినగి.. కమీషనర్ పి. సరస్వతి, జాయింట్ డైరక్టర్ సలహాలు, సూచనలు తప్పకుండా అందరూ సద్వవినియోగం చేసుకోవాలని తెలిపారు.. తదుపరి జాయింట్ డైరెక్టర్ మాట్లడతూ సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగినది. అదే విధముగా ప్రభుత్వ పాఠశాలలో రీ ఓపినింగ్ సందర్భంగా కొబ్బరి మట్టలు, రంగుల కలర్ ముగ్గులతో బడి పిల్లలకు స్వాగతం పలకడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సి. శ్యామ్ సుందర్, డీఈ వెంకన్న, ఆర్.ఓ. వేణుగోపాల్ రెడ్డి, మేనేజర్ నాగేశ్వర రావు, ఎస్.ఐ. వంకాయల యాదగిరి, ఎం.ఈ.పీ.ఎం.ఏ. శంకర్, ఈఈ మౌనిక, వార్డు ఆఫీసర్లు, సానిటేషన్ సిబ్బంది, ఆర్.పీ.లు, ఎస్.హెచ్.జీ. మహిళలు పాల్గొన్నారు.